నందిగామలో టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు

  • వారితోపాటు పలువురు కిందిస్థాయి నేతలు కూడా..
  • కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక
  • ఎన్నికల ముందు వైసీపీని వీడుతున్న నేతలు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్‌బై చెప్పేయగా తాజాగా కిందిస్థాయి నేతలు కూడా పార్టీని వీడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇద్దరు కౌన్సిలర్లు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు.

Telugudesam
YSRCP
Nandigama
Andhra Pradesh
AP Politics

More Telugu News